సింగరేణిని కాపాడుకోవడం అందరి బాధ్యత : జగదీశ్ రెడ్డి

సింగరేణిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. బొగ్గు గనులను వేలం వేయడం అంటే సింగరేణికి ఉరి వేయడమేనని వ్యాఖ్యానించారు.

By :  Vamshi
Update: 2024-06-21 09:45 GMT

సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడం అనేదని సింగరేణికి ఉరి వేయడమేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి తీసుకొని హైదరాబాద్‌లో దిగిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేశాడాన్నారు. తెలంగాణని అభివృద్ధి చేయాలన్న సోయి కాంగ్రెస్, బీజేపీలకు లేదని ఆయన మండిపడ్డారు. రెండు పార్టీలు ఏకాభిప్రాయంతోనే సింగరేణి ప్రైవేటికరణకు తేరలేపాయని ఆరోపించారు. నిన్నటి వరకు కలిసి వేలంపాటను నిర్వహిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం భట్టి, కేటీఆర్ హెచ్చరికతో ఇవాళ మాట మార్చాడని అన్నారు.

ఒకవేళ ప్రైవేటికరణ జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని తెలిపారు. సత్తుపల్లిలో మూడు, కొయ్యగూడెంలో మూడు గనులు ఉన్నాయని... వాటిని కేటాయిస్తే సింగరేణికి అనువుగా ఉంటుందన్నారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని కోరుతూ కిషన్ రెడ్డికి ఆయన వినతిపత్రం ఇచ్చారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సింగరేణి గనుల వేలం విషయంలో రేవంత్‌రెడ్డి స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్ర సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 

Tags:    

Similar News