పార్ట్‌టైం టీచర్ల తొలగింపుపై సీఎంకు హరీష్ రావు లేఖ

తెలంగాణ సర్కార్ తొలగించిన 6,200 మంది పార్ట్ టైమ్ లెక్చరర్లు, టీచర్లను, డీఈవోలను తిరిగి నియమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలో కోరారు.

By :  Vamshi
Update: 2024-09-04 15:08 GMT

తెలంగాణలో వేల మంది పార్ట్ టైమ్ టీచర్లు, లెక్చరర్లు, డీఈవోలను విధుల నుంచి తప్పించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం తొలగించిన సిబ్బందిని మళ్లీ నియమించాలని, దాంతో పాటు పెండింగ్ వేతలను చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీఈవోలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.సెప్టెంబర్ 5న జరిగే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం టీచర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిచడం ఆనవాయితి.

అలాంటి సంప్రదాయాన్ని పాటించకపోగా విద్యా బుద్ధులు నేర్పే గురువులను అర్థాంతరంగా తొలగించి వారికి, వారి కుటుంబాలకు అంతులేని క్షోభను కలిగించారు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైమ్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీఈవోలను ఏక కాలంలో తొలగించారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. దీనిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. గడిచిన మూడు నెలలుగా వీరికి జీతాలు చెల్లించడం లేదు. శాలరీలు అడిగిన పాపానికి ఏకంగా వారిని ఉద్యోగాల నుంచే తొలగించడం ఎంత వరకు సమంజసం. ఇదేనా మీరు చెపుతున్న ప్రజా పాలన అని హరీష్ రావు పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను తొలగించడం ద్వారా విద్యార్థులకు కూడా తీరని నష్టం జరుగుతున్నది.

సిలబస్ పూర్తికాక విద్యార్థులు నష్టపోతున్నారు. తొలగింపుకు గురైన టీచర్లు, వారి కుటుంబాలు అనుభవిస్తున్న బాధ చెప్పనలవి కానివి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటి కోచింగ్ కూడా అందించే వాళ్ళం. ఫలితంగా వేల మంది విద్యార్థులకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాలు లభించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో ఐఐటీ కోచింగ్ ఇచ్చే గురువులను తొలగించారు. దీని వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతున్నది. వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఎన్ఐటి కోచింగును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నం. తొలగించిన పార్ట్ టైమ్ లెక్చరర్లు, టీచర్లు, డీఈవోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వారి జీతాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News