కేరళ క్యాడర్, తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ అవార్డు
బాలల హక్కుల కోసం తీవ్రంగా కృషి చేసిన కృష్ణతేజ
తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు అరుదైన గౌవరం దక్కింది. కేరళ క్యాడర్ అధికారి అయిన తేజకు జాతీయ స్థాయిలో బాలల హక్కుల రక్షణ కమిషన్ అవార్డు వరించింది. కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ జిల్లా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీని వెనుక జిల్లా కలెక్టర్ కృష్ణతేజ కృషి ఎంతో ఉంది.
త్వరలోనే ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. కృష్ణతేజ ఎంతో సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు. ఏపీ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కృష్ణతేజను అభినందించారు. ఆయన మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులు, యువతకు ఆయన స్పూర్తిదాయకంగా ఉండాలని ఆశిస్తునని పవన్ తెలిపారు.