రేవంత్‌ స్వగ్రామంలో మహిళా జర్నలిస్టులపై దాడి

సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేశారు.

By :  Vamshi
Update: 2024-08-22 05:32 GMT

సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ అనుచరులు దాడి చేశారు. మహిళలు అని చూడకుండా సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ, ఫోన్లు, కెమెరాలు గుంజుకుని, భౌతిక దాడికి పాల్పడ్డారు.ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర, అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తొలిసారి.

రాష్ట్రంలో రేవంత్ అధికారంలోకి వచ్చినప్పడు నుండి పాత్రికేయులపై మీద వరుస దాడులు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయట పెడుతున్నందుకే అక్కసు పెంచుకుని, టార్గెట్ చేసి దాడులు చేశారు. నిజాన్ని నిర్బంగా చెబుతున్నందుకే దాడులు పాల్పడుతున్నారని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించించాయి.

Tags:    

Similar News