'కల్కి' మూవీ టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్‌ ధరలు పెంచడానికి, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

By :  Raju
Update: 2024-06-23 02:51 GMT

ప్రభాస్‌ హీరోగా, నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమా టికెట్‌ ధరలు పెంచడానికి, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్‌ ధరపై గరిష్ఠంగా రూ. 200 పెంపునకు అనుమతి ఇచ్చింది. సాధారణ టాకీసులలో రూ. 70, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 100 పెంచుకోవచ్చని పేర్కొన్నది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




 


 


ప్రభాస్‌, బిగ్‌ బీ అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సైన్స్‌ ఫిక్షన్‌ వస్తున్న మూవీగా ఫుటేజ్‌ మొత్తం నాలుగున్నర గంటలు వచ్చిందని సమాచారం. ప్రేక్షకులు చూడటానికి వీలుగా కథ, కథనాలు దెబ్బతినకుండా రన్‌టైమ్‌ను 3 గంటలకు కుదించినట్లు తెలుస్తోంది. ఇటీవల ముంబయి వేదికగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ప్రభాస్‌ అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉన్నది. 

Tags:    

Similar News