లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80,670 వద్ద, నిఫ్టీ 24,625 దగ్గర ట్రేడవుతున్నది.
By : Raju
Update: 2024-08-19 04:06 GMT
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 80,670 వద్ద, నిఫ్టీ 24,625 దగ్గర ట్రేడవుతున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.89 వద్ద ప్రారంభమైంది.
అమెరికా మాంద్యం భయాలు తగ్గడం, ఐటీ షేర్లు రాణించడం కలిసి రావొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.. దేశీయంగా జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ముగిసిన నేపథ్యంలో బుధవారం వెలువడే యూస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ వివరాల కోసం మదుపర్లు ఎదురు చూస్తున్నారు. అలాగే సెప్టెంబర్లో రేట్ల కోతలపై సంకేతాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయంగా చూస్తే స్టాక్ అధిక విలువపై ఆందోళన వ్యక్తమౌతున్నది. మరోవైపు నిఫ్టీ ఉన్నత శిఖర స్థాయి అయిన 25,000 పాయింట్లకు చేరకపోవచ్చని నిపుణులు అంటున్నారు.