ఆ నటుడు భూమి క్లియరెన్స్ కోసమే సీఎంను కలిశారా?
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత ఆ నటుడు సీఎంతో సమావేశం కావడం యాధృచ్ఛికం కాదని తన ప్రయోజనాల కోసమే సీఎంను కలిసినట్టు సమాచారం.
By : Raju
Update: 2024-07-31 05:48 GMT
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఓ సినీ నటుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇరువురి భేటీపై చర్చ జరుగుతున్నది. ఆ నటుడు సీఎంను మర్యాదపూర్వకంగా కలవడం వెనుక వేరే మతలబు ఉన్నదంటున్నారు. కోకాపేటలో తన భూమికి సంబంధించి క్లియరెన్స్ కోసమే ఆయన కలిసినట్టు ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల తర్వాత ఆ నటుడు సీఎంతో సమావేశం కావడం యాధృచ్ఛికం కాదని తన ప్రయోజనాల కోసమే సీఎంను కలిసినట్టు సమాచారం.