పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత రెండోసారి తల్లియ్యారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By :  Vamshi
Update: 2024-09-05 10:32 GMT

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత రెండోసారి తల్లి అయ్యారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డతో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏం పిల్లో.. ఏం పిల్లడో’ తో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణీత 2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజుని పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.

ప్రణీత కూతురు ఆర్నా తన తమ్ముడిని చూసి 'బేబి' అని పిలుస్తూ తెగ సంబరపడుతోంది. 2021లో కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ జంటకు మొదట ఆడబిడ్డ పుట్టింది. ఇప్పుడు రెండో కాన్పులో ప్రణీత మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణీత తల్లి ప్రముఖ గైనకాలజిస్టు అని తెలిసిందే. మొదటి కాన్పు ఆమె ఆసుపత్రిలోనే జరిగింది. నటి ప్రణీత కన్నడ, హిందీ, తమిళం, టాలీవుడ్ సినిమాల్లో నటించారు. 2010లో పోక్రీ కన్నడ మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

Tags:    

Similar News