వరద బాధితులకు మెగాస్టార్ భారీ విరాళం
ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ. 50 లక్షలు ప్రకటించిన చిరంజీవి
By : Raju
Update: 2024-09-04 03:54 GMT
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి రూ. కోటి (ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ. 50 లక్షలు) విరాళంగా ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కష్టాలు తనను కలిచివేశాయన్నారు. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమని అన్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగు పరచడానికి శాయశక్తులా కృషి చేస్తాయని చిరంజీవి పేర్కొన్నారు.
వరద బాధితులను ఆదుకోవడానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్బాబులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తలో రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాల ప్రజల కష్టాలు తమని కలిచి వేశాయని వారు వ్యాఖ్యానించారు.