హీరో రాజ్ తరుణ్‌ మోసం చేశాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

యువ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదుచేసింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి వదిలేసాడు అని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది

By :  Vamshi
Update: 2024-07-05 10:55 GMT

టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి మోసం చేశాడంటూ నార్సింగ్ పోలీసు స్టేషన్‌లో లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని చెపుతోంది. శారీరకంగా ఒకటయ్యాం. ఒకే ఇంట్లో ఉండే వాళ్లమని తెలిపింది. గుడిలో పెళ్లి చేస్తున్నామని యువతి ఆరోపించింది. తన కొత్త సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని నన్ను వదిలేశాడు అని లావణ్య ఆరోపిస్తోందితనకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని లావణ్య చెప్పినట్టుగా తెలిసింది. రాజ్‌ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని అతడిపై చర్యలు తీసుకొవాలని పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదులో తెలిపింది.

తనకి రాజ్ తరుణ్ మాత్రమే ప్రపంచం అని, అతను నాకు కావాలి అని చెపుతోంది లావణ్య. తనకి న్యాయం చెయ్యమని చెపుతోంది. గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు అని కూడా చెపుతోంది. అప్పుడు అరెస్టయి 45 రోజులు జైల్లో వున్నాను అని చెపుతోంది. ఆ సమయంలో రాజ్‌ తరుణ్ నుండి తనకు ఎలాంటి సాయం రాలేదు అని ఆరోపిస్తోంది లావణ్య. ఈ ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. లావణ్యతో కోన్నళ్లు కలిసి ఉన్నమని కానీ లావణ్య కొంత కాలంగా డ్రగ్స్ వాడుతోందన్నారు. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని ఆరోపించారు.

అందుకే దూరం పెట్టిను రాజ్ క్లారీటీ ఇచ్చారు.లావణ్యకు తన డబ్బులు కావాలని, తాను అక్కర్లేదని, అందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతుందని పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి శారీరక సంబంధం కానీ, మరే ఇతర సంబంధాలు కానీ లేవని స్పష్టం చేశారు. కానీ, లావణ్య తనను బెదిరిస్తుండేదని, అయితే తాను పరువు కోసం ఇవన్నీ భరించానని తెలిపారు. కొత్త హీరోయిన్ మాల్వీ మల్హోత్రాకు, తనకు లింకు పెడుతూ లావణ్య చేసిన ఆరోపణలపైనా రాజ్ తరుణ్ బదులిచ్చారు. మాల్వీ మల్హోత్రా తనకు చాలా మంచి ఫ్రెండ్ అని వెల్లడించారు. 

Tags:    

Similar News