చేనేత రంగంలో నాడు స్వర్ణయుగం.. నేడు సంక్షోభం:కేటీఆర్‌

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులందరికీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.'

చేనేత రంగంలో నాడు స్వర్ణయుగం.. నేడు సంక్షోభం:కేటీఆర్‌
X

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులందరికీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.'నరాలను పోగులుగా చేసి.. తమ రక్తాన్ని రంగులుగా వేసి.. గుండెలను కండెలుగా మార్చి.. చెమట చుక్కల్ని చీరలుగా మలచి..పేగులను వస్త్రాలుగా అందించి.. మనిషికి నాగరికతను అద్దిన.. చేనేత కార్మికులందరికీ.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. హృదయపూర్వక శుభాకాంక్షలు ' అని ట్విటర్ లో పోస్ట్‌ చేశారు.

దశాబ్దాల పాటు దగాపడిన చేనేత రంగానికి బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన ప్రగతి ప్రస్థానంలో దేశ చరిత్రలోనే ఒక స్వర్ణయుంగా పేర్కొన్నారు. నేత కార్మికుల కష్టాలు చూసిన కేసీఆర్‌ వినూత్న పథకాలతో మగ్గానికి మంచిరోజులు తీసుకొచ్చిన దార్శనికుడిగా కొనియాడారు. చేనేత రంగానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆరేళ్ల కాలంలో రూ. 600 కోట్లు కేటాయిస్తే బీఆర్‌ఎస్‌ పాలనలో రూ. 1200 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్‌ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించాయన్నారు. ఎన్నో విప్లవాత్మక పథకాలకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందన్నారు.

దేశంలో మొదటిసారి 50 శాతం సబ్సిడీతో 'చేనేత మిత్ర' పేరుతో పొదుపు పథకాన్ని తెచ్చామని, 'నేతన్నకు బీమా' పేరుతో రూ. 5 లక్షల రూపాయలతో ధీమా కల్పించామన్నారు. దీనిద్వారా 35 వేల మంది నేతలన్నల కుటుంబాలకు కొండంత అండ లభించిందని పేర్కొన్నారు.

అలాగే 10, 150 మంది చేనేత కార్మికలకు రూ. లక్ష వరకు రూ.29 కోట్ల రుణాలు మాఫీ చేశామని, చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్లతో ఆపన్న హస్తం అందించామని, పద్మశాలీల ఆత్మ గౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలు అనేకం తీసుకున్నామని వివరించారు.

సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించడానికి తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సిరిసిల్లలో అప్పరెల్‌ పార్క్‌ ఏర్పాటు ఓ సంకల్పమని, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌ ఓ సంచలమనని పేర్కొన్నారు. ఇలా బీఆర్‌ఎస్‌ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు విరబూస్తే కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో వాళ్ల బతుకులు ఛిద్రమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్డీఏ హయాంలో తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్సీ పన్ను విధించిందని, ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ బోర్డు, ఆల్‌ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్‌ బోర్డు, ఆల్‌ ఇండియా పవర్‌ లూమ్‌ బోర్డులను రద్దు చేసింది. చేనేత కార్మికుల త్రిఫ్ట్‌ పథకం, హౌస్‌ కం వర్క్‌ షెడ్‌ పథకం, మహాత్మాగాంధీ బునకర్‌ బీమా పథకం రద్దు చేసింది. యూర్న్‌పై సబ్సిడీ 40 శాతం నుంచి 145 శాతానికి కుదించిందని మండిపడ్డారు.

ఇక రాష్ట్రంలో రేవంత్‌ పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలోకి కూరుకుపోయిందని, నిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని, సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించాలని, బీఆర్‌ఎస్‌ పాలనలో అమలైన పథకాలను కొసాగించాలని కోరారు. జై తెలంగాణ, జై చేనేత అని కేటీఆర్‌ రాసుకొచ్చారు.

Raju

Raju

Writer
    Next Story