కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ కేసులో సంచలన విషయాలు

కోల్‌కతా జూనియర్ మహిళ డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె డెడ్‌బాడీలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది.

Kolakatha
X

కోల్‌కతా జూనియర్ మహిళ డాక్టర్ రేప్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె డెడ్‌బాడీలో 150 గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. దీనిపై ట్రైయినీ వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిందని తెలుస్తోంది. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందని తెలిపారు. ఈ హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని మృతురాలి కుటుంబ సభ్యులు సైతం స్పష్టం చేశారని డాక్టర్ గోస్వామి గుర్తు చేశారు.

అలాగే ఆమె శరీరంపై గాయాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దాంతో సీబీఐ అధికారులు బుధవారం కోల్‌కత్తాలోని ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆసుపత్రి ఉన్నతాధికారులతో సీబీఐ అధికారులు సమావేశమయ్యారు. ఈ హత్యాచారం కేసులో పోస్ట్‌మార్టం నివేదికతోపాటు ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆ యా ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌లను బహిర్గతం చేయాలని డాక్టర్‌లు డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. జూనియర్ వైద్యురాలుని గొంతు కోసి హత్య చేశారు. దాంతో ఆమె థైరాయిడ్ భాగంలోని మృదులాస్థితి విరిగిపోయింది.

అలాగే ఆమె మృతదేహంలోని ప్రైవేట్ భాగాల్లో సైతం గాయాలు స్పష్టంగా కనిపించాయి. అదే విధంగా పెదవులు, వేళ్లు, ఎడమ కాలుపై భాగంలో సైతం గాయాలను గుర్తించారు. ఆమె కళ్లతోపాటు నోటి నుంచి సైతం రక్తం కారిన విషయాన్ని ఈ నివేదికలో స్పష్టం చేశారు. లైంగిక దాడి జరిగినప్పుడు బిగ్గరగా అరవకుండా.. ఆమె నోటిని గట్టిగా బిగించారు. దీంతో ఆమె ఊపిరాడని పరిస్థితిలోకి వెళ్లారు. అలాగే ఆమె తల భాగాన్ని గోడకు కొట్టినట్లుగా ఈ నివేదికలో స్పష్టమైంది. ముఖంపై గీతలు సైతం కనిపించాయి. లైంగిక దాడి చేసే క్రమంలో ఆమెను తీవ్రంగా హింసించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక సైతం స్పష్టం చేసిందని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి తెలిపారు. మరోవైపు దీనికి బాధ్యత వహిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమత రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story