వాల్మీకి స్కాంలో టీ కాంగ్రెస్ నేతల పాత్ర : కేటీఆర్

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్ర కూడా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR123
X

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పాత్ర కూడా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని 9 బ్యాంక్ అకౌంట్లకు రూ.45 కోట్ల నిధుల తరలింపు జరిగిందిని కేటీఆర్ పేర్కొన్నారు. వీటినే మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వాడిందని మాజీ మంత్రి అన్నారు. వాల్మీకి కుంభకోణంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ పాత్రపై ఉందని కేటీఆర్ అన్నారు. సీఎం సిద్దరామయ్య డైరెక్టుగా ఇరుక్కున్న ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ రూ. 187 కోట్ల నిధుల తరలింపు కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలోకి రూ. 45 కోట్ల నిధుల తరలింపు జరిగిందన్నారు.

సిద్దరామయ్యను సీఎం పదవి నుండి తప్పించాలని అధిష్టానంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లు చేసిందన్నారు.. సిద్దరామయ్యను మారిస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డిని కూడా మార్చాలంటూ కర్ణాటక మంత్రి సతీష్ జర్కిహోలి చేసిన కామెంట్స్‌ని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ స్కాం మీద మీడియాలో చర్చ జరగకుండా ఎన్ కన్వెన్షన్ మీద "హైడ్రా పేరిట దాడులు అంటూ హైడ్రామా చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ఓ వీడియోను విడుదల చేసిన కేటీఆర్.. ఆ వీడియోలో ఇలా చెప్పుకొచ్చారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య డైరెక్ట్‌గా ఇరుక్కున్న ఎస్టీ కార్పొరేషన్ డెవలప్మెంట్ రూ. 187 కోట్ల నిధుల తరలింపు కుంభకోణంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లలోకి రూ. 45 కోట్ల నిధుల తరలించారని చెప్పుకొచ్చారు.

Vamshi

Vamshi

Writer
    Next Story