నాపై ఈడీ దాడులు జరగొచ్చు: రాహుల్
తనపై ఈడీ దాడులు జరగొచ్చని.. ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్ధమైతే వారిని ఆహ్వానించేందుకు ఛాయ్, బిస్కెట్లతో సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
- By RajuLoading...
- | 2 Aug 2024 5:50 AM GMT
X
తనపై ఈడీ దాడులు జరగొచ్చని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకు సమాచారం వచ్చిందని వెల్లడించారు.జులై 29న నేను పార్లమెంటులో చేసిన 'చక్రవ్యూహం' స్పీచ్ ప్రతి ఇద్దరిలో ఒకరికి నచ్చలేదన్నారు. ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్ధమైతే వారిని ఆహ్వానించేందుకు ఛాయ్, బిస్కెట్లతో సిద్ధంగా ఉన్నట్టు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్సభలో చర్చ సందర్భంగా రాహుల్గాంధీ సోమవారం ప్రసంగించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలో నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ .. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరికొందరిపై రాహుల్ విమర్శలు గుప్పించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంతో ఆరుగురు ఎలా హత్య చేశారో, ఇప్పడు దేశాన్నీ అదే చేయబోతున్నారని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.