సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఫోన్
తెలంగాణలో భారీ వర్షాలు, వరదతో వాటిల్లిన నష్టంపై ఆరా
- By Naveen KameraLoading...
- | 1 Sept 2024 5:37 PM GMT
X
X
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి వేర్వేరుగా ఫోన్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో జరిగిన నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ వర్షాలతో ఎక్కువ దెబ్బతిన్నదని, ఎక్కువ నష్టం వాటిల్లిందని సీఎం వివరించారు. పలు జిల్లాల్లో వర్షం ధాటికి జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కు రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో ఎక్కువగా ప్రాణనష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్న రాష్ట్ర అధికారయంత్రాంగాన్ని ప్రధాని అభినందించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ సేవలందించే హెలీక్యాప్టర్లను పంపిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
Naveen Kamera
Writer
Next Story