జనసేన పార్టీ ఆఫీస్ బయటే పవన్ ప్రజాదర్బార్
జనసేన పార్టీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ ప్రజాదర్బార్ నిర్వహించారు.
- By VamshiLoading...
- | 22 Jun 2024 12:25 PM GMT
X
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాదర్బార్ రోడ్డుపైన నిర్వహించారు. అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ ఆఫీసుకొచ్చిన పవన్ను కలిసేందుకు ప్రజలు భారీగా వచ్చారు. అయితే పవన్ అక్కడే కాన్వయ్ ఆపి ఆఫీసు ముందు బాధితులతో మాట్లాడారు. వాళ్ల అర్జీలు తీసుకున్నారు. సమస్యలపై అధికారులతో మాట్లాడారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన పవన్ స్వయంగా వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Also Read - 30 నుంచి డీఏవో రాత పరీక్షలు
అనంతరం వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలు చెప్పుకొని వాటిని తీర్చాలని కోరారు. కొంతమంది అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి అప్పటికప్పుడే కొన్ని సమస్యలు పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి కాల పరిమితి నిర్ణయించి ఆలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం సరికొత్త కార్యక్రమం ప్రజాదర్బార్ చేపట్టిన సంగతి తెలిసిందే.