నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కులేదా: హరీశ్‌

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకు వచ్చింది మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

నిరుద్యోగులకు నిరసన తెలిపే హక్కులేదా: హరీశ్‌
X

సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా? తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా? అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

హామీలు ఇచ్చి, మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, డిమాండ్ల సాధనే లక్ష్యంగా టీజీపీఎస్సీ వద్ద శాంతియుత నిరసన తెలుపడానికి విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లారు. వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని హరీశ్‌తెలిపారు..

రేవంత్ సర్కారు ఒకవైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ.. నిరుద్యోగుల గొంతులను, హక్కులను అణగదొక్కే కుట్రలకు పాల్పడుతున్నది. ఇది ప్రజాపాలన కాదు ముమ్మాటికీ అప్రజాస్వామ్య పాలన అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కోసం పుస్తకాలు పట్టుకొని చదవాల్సిన విద్యార్థులను నడిరోడ్డుకు ఈడ్చి ధర్నాలు, ఆందోళనలు చేసే దుస్థికి తీసుకు వచ్చింది అన్నారు.

ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తామంటే నిరుద్యోగులే కాదు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టమని హెచ్చరించారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతాం. నిర్వారామ పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని, నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌ తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story