కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత భేటీ
బిడ్డను చూసి భావోద్వేగానికి గురైన మాజీ సీఎం కేసీఆర్
- By Naveen KameraLoading...
- | 29 Aug 2024 8:29 AM GMT
X
X
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ కవిత గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్యతో కలిసి బంజారాహిల్స్ లోని తన నివాసం నుంచి బయల్దేరిన కవితకు ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఘన స్వాగతం పలికారు. కవితకు దిష్టితీసి లోపలికి తీసుకెళ్లారు. తన బిడ్డ కవితను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన బిడ్డను చూసిన ఉద్వేగానికి లోనయ్యారు. కవిత తన తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీర్వదించారు. కవితను దగ్గరికి తీసుకొని ఓదార్చారు. ఇన్నాళ్లు దిగాలుగా ఉన్న కేసీఆర్ బిడ్డ తిరిగి రావడంతో ఉత్సాహంగా కనిపించారు.
Naveen Kamera
Writer
Next Story