ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

ఢిల్లీ లిక్కర్‌ విధానానికి సంబంధించన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు
X

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరైంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రూ. లక్ష పూచీకత్తుగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి గురువారం ఉదయం (జూన్‌ 20న) తీర్పు రిజర్వ్‌ చేసిన రౌస్‌ అవెన్యూ కోర్టు వెకేషన్‌ జడ్జి నియాయ్‌ బిందూ.. అదే సాయంత్రం బెయిల్‌ ఆదేశాలు జారీ చేశారు.

అయితే బెయిల్‌ బాండ్‌పై సంతకం చేసేందుకు వీలుగా 48 గంటల పాటు స్టే విధించాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. తద్వారా ఈ తీర్పును పైకోర్టులో సవాల్‌ చేయడానికి వీలు కలుగుతుందని విజ్ఞప్తి చేసింది. ఈడీ వాదనను తిరస్కరించిన కోర్టు అందుకు నిరాకరించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Raju

Raju

Writer
    Next Story