కానిస్టేబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లా వ్యవహరిస్తున్నడు
సీఎం అండతో రెచ్చిపోతున్నడు.. సోనియాగాంధీకి ఆర్టీఏ అధికారుల కంప్లైంట్
- By Naveen KameraLoading...
- | 6 Aug 2024 4:25 PM GMT
X
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పని చేసే జైపాల్ రెడ్డి అనే వ్యక్తి డిపార్ట్మెంట్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తీసుకొని డిఫాక్టో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ లా వ్యవహరిస్తున్నాడని తెలంగాణ స్టేట్ ఆర్టీఏ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ బేరర్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి కంప్లైంట్ చేశారు. జూలై 28న సోనియాగాంధీకి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి తన పర్సనల్ అసిస్టెంట్ గా తన సమీప బంధువు అయిన ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ జైపాల్ రెడ్డిని నియమించుకున్నారని తెలిపారు. సీఎం దగ్గర పీఏగా చేరిన నాటి నుంచి జైపాల్ రెడ్డి డిపార్ట్మెంట్ మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆదిపత్యం చెలాయిస్తున్నారని వివరించారు. ఆర్టీఏ చెక్ పోస్టుల్లో పని చేసే అధికారులను టార్గెట్ వేధింపులకు గురి చేస్తున్నాడని, తాను అడిగిన మొత్తం ఇవ్వకపోతే ప్రాధాన్యత లేని ప్రాంతాలకు బదిలీ చేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి అక్రమాలు, అవినీతి, మితిమీరిన అధికారాల చెలాయింపుపై సోనియాగాంధీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అతడిపై చర్యలు తీసుకునేలా సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని కోరారు.
సోనియాగాంధీకి కంప్లైంట్ చేసిన ఫిర్యాదు కాపీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి↑