బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి అడుగు పెట్టింది వీరే

గ్రాండ్‌ గా ప్రారంభమైన ఎనిమిదో సీజన్‌

బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి అడుగు పెట్టింది వీరే
X

బిగ్‌ బాస్‌ ఎనిమిదో సీజన్‌ ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. హోస్ట్‌ నాగార్జున మొదట బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వెళ్లి ఆడియన్స్‌ కు హౌస్‌ ను పరిచయం చేశారు. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ ఎనిమిదో సీజన్‌ కంటెస్టెంట్స్‌ ను జంటలుగా హౌస్‌ లోకి పంపారు. మొదట టీవీ నటి యష్మీ గౌడ బిగ్‌ బాస్‌ వేదికపైకి వచ్చారు. నటుడు నిఖిల్‌ తో కలిసి మొదటి జంటగా వాళ్లిద్దరు బిగ్‌ హౌస్‌ లో అడుగు పెట్టారు. పెళ్లిచూపులు ఫేమ్‌ అభయ్‌, టీవీ నటి ప్రేరణ రెండో కపుల్‌ గా హౌస్‌ లోకి ఎంటర్‌ అయ్యారు. నటుడు ఆదిత్య ఓం, రాంగోపాల్‌ వర్మ తీసిన దిశ సినిమా నటి సోనియా, బెజవాడ బేబక్క, నటుడు శేఖర్‌ భాషా, కిరాస్‌ సీత, నాగమణికంట, పృథ్వీరాజ్‌, యాంకర్‌ విష్ణుప్రియ, నైనిక, నబీల్‌ అఫ్రిది బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి అడుగు పెట్టారు. మొత్తం ఎనిమిది జంటలుగా పదహారు మంది కంటెస్టెంట్స్‌ బిగ్‌ బాస్‌ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Next Story