సీఎం స్వగ్రామంలో మహిళ జర్నలిస్టులపై దాడి.. స్పందించిన మహిళా కమిషన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళ జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటన మీద మహిళా కమిషన్ స్పందించింది.
- By VamshiLoading...
- | 23 Aug 2024 9:32 AM GMT
X
సీఎం రేవంత్రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లెలో మహిళ జర్నలిస్టులపై దాడిపై మహిళ కమీషన్ స్పందించింది. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూలు ఎస్పీకి మహిళ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని సూచించారు. కాగా, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదను కాంగ్రెస్ గూండాల చేతిలో దాడికి గురైన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి శుక్రవారం నాడు కలిశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామమైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీకార్డులు లాక్కున్నారు. పట్టపగలు సినిమాల్లోని వీధి గూండాలను తలపించారు. ఇంత జరిగాక, విషయం పోలీస్ స్టేషన్కు చేరాక కూడా వారిపై వేధింపులు ఆగలేదు. పోలీస్ స్టేషన్లోనే ఒకడు జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినా పోలీసులు చోద్యం చూశారు