బర్త్‌డే రోజు శ్రీవారి సేవలో అంజనీ పుత్రుడు

మెగాస్టార్ చిరంజీవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 69వ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Mega star chiru
X

మెగాస్టార్ చిరంజీవి తన పుట్టిన రోజు సందర్బంగా ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని చిరుతో పాటు సతీమణి సురేఖ, తల్లి అంజన దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలుమొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మెగాస్టార్‌ని చూసేందుకు అభిమానులు, జనసేన నాయకులు భారీగా తరలివచ్చారు. కాసేపు ఆలయ ప్రాంగణం సందడి వాతావరణం ఏర్పడింది. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే ఆరవ శ్రీనివాసులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. చిరుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా చిరుకు అభిమానులు విషెష్ తెలియజేస్తున్నారు. చిరు బర్త్ డే సందర్బంగా మెగాస్టార్ నటించిన ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు విడుదల అయ్యాయి. థియేటర్స్ వద్ద ఫాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరు ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Vamshi

Vamshi

Writer
    Next Story