ఐఫోన్‌ ప్రియులకు తీపి కబురు... భారీగా ధరలు తగ్గించిన యాపిల్‌

ఐఫోన్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

APPLE PHONE
X

ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్‌ ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది. బడ్జెట్‌లో కస్టమ్‌ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు యాపిల్‌ బదిలీ చేసింది.. దీంతో ఐఫోన్‌ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. యాపిల్ తాజా నిర్ణయంతో ప్రో మోడల్ ధర రూ.5,100, ప్రో మ్యాక్స్‌ మోడల్‌ ధర రూ.6 వేలు మేర తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్‌ 13, 14, 15 మోడళ్ల ధరలూ స్వల్పంగా తగ్గాయి. ఐఫోన్‌ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను యాపిల్‌ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేసింది.

దీంతో భారతీయ స్మార్ట్ ఫోన్ యూజర్లకు లబ్ధి చేకూరనున్నది. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకూ తగ్గనున్నాయి. ఐ-ఫోన్ 13, ఐ-ఫోన్ 14, ఐ-ఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారయ్యే ఐ-ఫోన్ల ధరలు రూ.300, ఐ-ఫోన్ ఎస్ఈ ధర రూ.2300 తగ్గనున్నది.ఆపిల్ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. సంప్రదాయంగా కొత్త ఐ-ఫోన్ మార్కెట్లో ఆవిష్కరిస్తున్నప్పుడు పాత మోడల్ ఫోన్ల ధరలు తగ్గిస్తూ వస్తుంది. ఆపిల్ ధర తగ్గింపుతోపాటు డీలర్లు, రీసెల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల సేల్స్ క్లియర్ చేసుకోవడానికి అదనపు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు.

Vamshi

Vamshi

Writer
    Next Story