- Home >
- Entertainment >
- Sports
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇదే..
అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే తేదీలు ఇవే.
- By RajuLoading...
- | 26 Aug 2024 4:46 PM GMT
X
ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్ కప్కు రంగం సిద్ధమైంది. టోర్నీ షెడ్యూల్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్నది. ఈ మెగా టోర్నీకి యూఏఈ అతిథ్యమివ్వనున్నది.వాస్తవానికి ఈ టోర్నీ బంగ్లాదేశ్లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ సంక్షోభం పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
మొత్తం 10 టీమ్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన టీమ్లు సెమీస్కు చేరుతాయి.గ్రూప్ ఏ భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా... గ్రూప్ బీలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
ఇందులో భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో, అక్టోబర్ 6న పాకిస్థాన్తో, అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనున్నది. అక్టోబర్ 17న సెమీ ఫైనల్, అక్టోబర్ 18న సెమీఫైనల్ 2, అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.