- Home >
- Entertainment >
- Sports
టీ20లో టీమిండియా ఘన విజయం..సిరీస్ కైవసం
జింబాబ్వేతో ఐదు టీ20 సిరీస్లో భాగంగా భారత్ నాలుగో మ్యాచ్లో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నది.
- By RajuLoading...
- | 13 July 2024 2:42 PM GMT
X
సీనియర్ ఆటగాళ్లు లేకుండానే జింబాబ్వే టూర్కు వెళ్లిన యువ భారత్ అదరగొట్టింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 153 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 15.2 ఓవర్లలో ఛేధించింది.ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ (93 నాటౌట్), కెప్టెన్ శుభ్మన్ గిల్ (58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఈ విజయంతో 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నది.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ సికిందర్ (46), మరుమని (32), వెస్లీ (25) రాణించారు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్పాండే, సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దుబే చెరో వికెట్ తీశారు. నామమాత్రపు ఆఖరి మ్యాచ్ రేపు (ఆదివారం) జరగనున్నది.