టాస్ గెలిచిన లంక..ఇండియా బ్యాటింగ్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది.

Srilanka
X

పల్లకెల్లే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది. నూతన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ శిక్షణలో, కొత్త కెప్టెన్‌ సూర్యకుమార్‌ సారథ్యంలో టీమిండియా ఆ టీ20 సిరీస్ ఆడబోతోంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూర్యకుమార్‌ ఈ జట్టుని సారథిగా ఎలా నడిపిస్తాడన్నదీ ఎంతో కీలకమే. ఇదిలావుండగా.. భారత తుది జట్టులో శివమ్‌ దూబె, సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్‌, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం దక్కలేదు.

తుది జట్లు

భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషభ్‌ పంత్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక: పాథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), వానిందు హసరంగ, డాసున్ శనక, మహీశ్ తీక్షణ, మతీశా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.

Vamshi

Vamshi

Writer
    Next Story