- Home >
- Entertainment >
- Sports
షఫాలీ విధ్వంసం..టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఐకైక టెస్టులో భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో వీరవిహారం చేసిన షఫాలీ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది
- By VamshiLoading...
- | 28 Jun 2024 11:43 AM GMT
X
దక్షిణాప్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ డబుల్ సెంచరీతో చెలరేగింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో వీర విహారం చేసిన షఫాలీ. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆమె ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుకెక్కింది. కేవలం 194 బంతుల్లోనే 8 సిక్సర్లు, 22 బౌండరీలతో ద్విశతకం నమోదు చేసింది. 20 ఏళ్ల షఫాలీ వర్మకు ఈ ఫార్మాట్లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మొత్తంగా 205 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె పెవిలియన్ చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ద్విశతకాన్ని నమోదు చేసింది.
షాఫాలీ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(4) ఆచితూడి ఆడుతోంది. మరో ఎండ్లో జెమీమా రోడ్రిగ్స్(41) దూకుడు కనబరుస్తోంది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అంతర్జాతీయ మహిళల టెస్టుల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (292 రన్స్ ) నెలకొల్పిన ద్వయంగా వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఈ రికార్డు పాక్ జోడీ సజ్జిదా షా, కిరణ్ బలూచ్ (241) పేరిట ఉండేది. ప్రస్తుతం మ్యాచ్లో భారత్ స్కోరు 467/4 (92 ఓవర్లు) గా ఉంది. స్మృతి మంధాన కూడా శతకం (149) తో కదం తొక్కింది.