- Home >
- Entertainment >
- Sports
పారిస్ ఒలింపిక్స్..ప్రీక్వార్టర్స్కు పీవీ సింధు
పారిస్ ఒలింపిక్స్లో పీవీ సింధు సత్తా చాటారు. ఎస్తోనియా దేశానికి చెందిన క్రిస్టినా కుబాపై విజయం సాధించి ప్రీక్వార్టర్స్కు చేరుకున్నది.
- By RajuLoading...
- | 31 July 2024 8:39 AM GMT
X
పారిస్ ఒలింపిక్స్లో భాగంగా గ్రూప్ స్టేజ్లో నిర్వహించిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు సత్తా చాటారు. ఎస్తోనియా దేశానికి చెందిన క్రిస్టినా కుబాపై సింధు 21-5,21-10 తేడాతో గెలుపొందారు. ఈ విజయంతో ఆమె ప్రీక్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నది.
మొదటి గేమ్లో క్రిస్టినా ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అయితే రెండో గేమ్ ప్రారంభంలో మాత్రం ఆమె నుంచి సింధుకు ప్రతిఘటన ఎదురైంది. ఎక్కడా ఏకాగ్రత కోల్పోకుండా పట్టు బిగించింది. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్ను కేవలం 34 నిమిషాల్లోనే మ్యాచ్ ను ముగించడం విశేషం.
ఆమె గ్రూప్ స్టేజ్లో 2 మ్యాచ్లలో నెగ్గి 4 పాయింట్లతో ముగ్గురు మహిళల గ్రూప్ Mలో అగ్రస్థానంలో నిలిచింది. సింధు ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై అలవోక విజయంతో తన గెలుపు ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరోవైపు సింధు విజయం పట్ల క్రీడాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.