పారాలింపిక్స్‌: పురుషుల షూటింగ్‌లో రజతం

పరుగు పందెం విభాగంలో కాంస్య పతకం గెలిచిన ప్రీతిపాల్‌. దీంతో భారత్‌ ఖాతాలో 4 పతకాలు చేరాయి.

పారాలింపిక్స్‌: పురుషుల షూటింగ్‌లో రజతం
X

పారాలింపిక్స్‌లో భారత పురుష అథ్లెట్‌ కూడా బోణి కొట్టారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ ఎస్‌హెచ్‌-1 షూటింగ్‌ విభాగంలో మనీశ్‌ నర్వాల్‌ రజత పతకం సాధించాడు. దీంతో భారత్‌ ఖాతాలో 4 (1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్యం) పతకాలు చేరాయి.

అంతకు ముందు మహిళల 100 మీటర్ల, టీ 25 పరుగు పందెం విభాగంలో ఫైనల్‌లో ప్రీతిపాల్‌ కాంస్య పతకం గెలిచింది. 14.21 సెకన్లలో తన రేసును ముగించారు. చైనాకు చెందిన అథ్లెట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. ప్రీతిపాల్‌.. యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఓ రైతు కుటుంబంలో జన్మించింది. పుట్టినప్పుడే ఆమె శారీరక సమస్యలు ఎదుర్కొన్నది. కాళ్లలో సత్తువ కోసం పలు చికిత్సలు చేయించుకుంటున్నా. ఆమె సాధించిన కాంస్యంతో భారత్‌ పతకాల సంఖ్య మూడుకు చేరింది.

Raju

Raju

Writer
    Next Story