ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ ..మను బాకర్ కు కాంస్యం

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది.10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించింది.

ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ ..మను బాకర్ కు కాంస్యం
X

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ కొట్టింది. భారత్‌ తొలి పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించింది. మను 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో 221.7 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.కొరియన్‌ షూటర్లు ఓహ్‌ యే జిన్‌ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్‌ యెజి రజతం (241.3 పాయింట్లు)సాధించారు.

ఈ విభాగంలో 20 ఏళ్ల తర్వాత భారత్‌ నుంచి ఫైనల్‌ చేరిన మొదటి మహిళా షూటర్‌గా మను బాకర్‌ కాంస్య పతకాన్ని సాధించి దేశ కీర్తి పతకాన్నిఎగురవేసింది.మరోవైపు పురుషుల 10 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో అర్జున్‌ బబుతా ఫైనల్‌కు చేరాడు. అతడు 630.1 స్కోర్‌తో ఏడో స్థానంలో నిలిచాడు.

Raju

Raju

Writer
    Next Story