లంకపై భారత్‌ ఘన విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

లంకపై భారత్‌ ఘన విజయం
X

మూడు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (58, 26 బంతుల్లో) రిషబ్‌ పంత్‌ (49) చెలరేగిపోయారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. లంక బ్యాటర్లలో నిశాంక (79), కుశాల్‌ మెండిస్‌ (45) రాణించినా మిగతా బ్యాటర్లు చేతులెత్తడంతో ఫలితం లేకుండా పోయింది.భారత బౌలర్లలో పరాగ్‌ 2, అర్ష్‌దీప్‌ 2, అక్షర్‌ పటేల్‌ 2, రవి బిష్ణోయ్‌ 1, సిరాజ్‌ 1 వికెట్‌ తీశారు.

టాస్‌ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు ఆరంభం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. కెప్టెన్‌ సూర్య హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. అతనికి టీ 20 ల్లో 20 అర్ధశతకం. పంత్‌, జైశ్వాల్‌, గిల్‌ కీలక ఇన్నింగ్‌ ఆడారు.లంక బౌలర్లలో పతిరణ 4 వికెట్లు తీయగా.. మధుశంక, హసరంగ, ఫెర్నాండో తలో వికెట్ తీశారు.

Raju

Raju

Writer
    Next Story