- Home >
- Entertainment >
- Sports
మహ్మద్ సిరాజ్కు అభిమానులు ఘన స్వాగతం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
- By VamshiLoading...
- | 5 July 2024 3:41 PM GMT
X
టీ20 వరల్డ్ కప్ విజేత మహ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్యాన్స్ సిరాజ్కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. మెహదీపట్నం నుంచి రోడ్ షో కూడా నిర్వహించారు. ఓపెన్ టాప్ జీపులో అతడు అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడు. సరోజిని దేవి హాస్పిటల్ నుంచి ఈద్గా గ్రౌండ్ వరకు రోడ్ షో కూడా నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీపులో మెడలో తాను గెలిచిన టీ20 వరల్డ్ కప్ మెడల్ వేసుకొని సిరాజ్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగాడు.
కొన్నాళ్లుగా టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగిన సిరాజ్.. ఇప్పుడీ వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ ఉన్నాడు.టీ20 వరల్డ్ కప్ లో మహ్మద్ సిరాజ్ లీగ్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అందులో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. పస్ట్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై 3 ఓవర్లు వేసి 13 రన్న్ ఇచ్చి వికెట్ తీశాడు. తర్వాత పాకిస్థాన్ తో మ్యాచ్ లో 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చినా వికెట్ తీయలేదు. ఇక యూఎస్ఏతో మ్యాచ్ లో 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. వికెట్ వికెట్ తీయలేదు. ముంబాయి వాంఖడేలో భారత ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్కు బీసీసీఐ సన్మానన కార్యక్రమం నిర్వహించింది. రూ.125 కోట్ల రివార్డు అందించిన సంగతి తెలిసిందే