బైబై పారిస్‌.. తర్వాతి స్టాప్‌ లాస్‌ ఏంజెలెస్‌

పంతొమ్మిది రోజుల పాటు పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. 2028లో జరిగే తర్వాత ఒలింపిక్స్‌కు లాస్‌ఏంజెలెస్‌ ఆతిథ్యం ఇవ్వనున్నది.

బైబై పారిస్‌.. తర్వాతి స్టాప్‌ లాస్‌ ఏంజెలెస్‌
X

పంతొమ్మిది రోజుల పాటు పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ క్రీడలు ప్రపంచాన్ని ఉర్రూతలూగించాయి. 2028లో జరిగే తర్వాత ఒలింపిక్స్‌కు లాస్‌ఏంజెలెస్‌ ఆతిథ్యం ఇవ్వనున్నది. 44 ఏళ్ల తర్వాత అతిథ్యమివ్వబోతున్న అమెరికా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. మూడోసారి అతిథ్య నగరంగా మారబోతున్న లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్‌ పతాకాన్ని అందుకున్నది. ఇప్పటివరకు లండన్‌ (1908, 1948, 2012), పారిస్‌ (1900, 1924, 2024) మాత్రమే ఒలింపిక్స్‌కు మూడుసార్లు ఆతిథ్యమిచ్చాయి.

సెన్‌ నదిలో అట్టహాసంగా ప్రారంభమైన ఒలింపిక్స్‌ ఈసారి ఒలింపిక్స్‌ వేడుకలు నిన్న ముగిశాయి. గత ఏడాది ఏడు పతకాలు గెలుచుకున్న భారత్‌ ఈసారి ఆరు పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అత్యధిక స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలువగా..ద్వితీయ, తృతీయ స్థానాల్లో చైనా, జపాన్‌ నిలిచాయి. ఆరు పతకాలతో భారత్‌ 71వ స్థానంతో సరిపెట్టుకున్నది.

ఓపెనింగ్‌ నుంచి భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ క్వార్టర్స్‌, సెమీస్‌ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌లో భారత్‌కు మరో పతకం ఖాయనని అందరూ అనుకుంటుండగా.. అనూహ్యంగా నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు అదనంగా ఉన్నదనే కారణంతో అనర్హత వేటుకు గురికావడం మన దేశ అభిమానులను నిరాశకు గురి చేసింది. లింగ వివాదంలో అల్జీరియా బాక్సర్‌ ఇమానె ఖెలిఫ్‌ ఆమె కాదంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కేవలం 46 సెకన్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేయడంలో ఈ వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. ఆస్ట్రేలియా స్కేట్‌బోర్డింగ్‌ సంచలన అథ్లెట్‌ ఆరిసా ట్రై రికార్డు సృష్టించింది. 14 ఏళ్ల వయసులోనే ఆమె దేశం తరఫున స్వర్ణ పతకం సాధించింది.

మరోవైపు క్యూబా రెజ్లర్‌ మిజైన్‌ లోపేజ్‌ చరిత్ర సృష్టించాడు. వ్యక్తిగత విభాగంలో వరుసగా ఐదు స్వర్ణ పతకాలను సాధించిన అథ్లెట్‌గా నిలిచాడు. ఈ ఒలింపిక్స్‌ తర్వాత వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమని ప్రకటించాడు. టెన్సిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ గోల్డెన్‌ స్లామ్‌గా నిలిచాడు. ఒలింపిక్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ విభాగంలో కార్లోస్‌ అల్కరాజ్‌పై విజయం సాధించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

ఇక టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో దక్షిణ కొరియా కాంస్యం గెలుచుకోగా.. ఉత్తర కొరియ రజతం దక్కించుకున్నది. దీంతో ఒకే పోడియంపై ఇరు దేశాల అథ్లెట్లు సెల్ఫీ తీసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ దేశాల క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించడం గమనార్హం.

సెకన్‌లో ఐదువేల వంతు తేడాతో నోవా లైల్స్‌ పరుగుల వీరుడుగా అవతరించాడు. 100 మీటర్ల ఫైనల్స్‌లో 9.79 సెకన్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా లైల్స్‌ మాట్లాడుతూ.. 'అందరిలోకెల్లా నేనే ముందుంటా.. నేను తోడేళ్లకే తోడేలును' అని వ్యాఖ్యానించాడు. జకోవిచ్‌ ఇప్పటికే ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకున్నసంగతి తెలిసిందే. ఇప్పుడు స్వర్ణంతో అన్నింటిని సొంతం చేసుకున్న ఐదో టెన్నిస్‌ ప్లేయర్‌గా నిలిచాడు. ఈసారి ఒలింపిక్స్‌లో ఇవన్నీహైలెట్‌గా నిలిచాయి.

ఒలింపిక్స్‌ చివరి రోజున భూటాన్‌ మారథాన్‌ రన్నర్‌ క్రీడాస్ఫూర్తిని చాటాడు.బంగారు పతక విజేత చేరుకున్న 90 నిమిషాల తర్వాత మారథాన్‌ పూర్తి చేసింది. ఓడిపోయానని తెలిసినా కింజాంగ్‌ లామో రేసు మొత్తం పూర్తి చేసింది. ఆమె పట్టుదలకు స్టాండింగ్‌ ఒవేషన్‌తో వీక్షకులు గౌరవించారు.

పారిస్‌ ముగింపు వేడుకల్లో హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌కు బలవంతంగా ఓ మహిళ ముద్దు పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కసారిగా ఆమె తనను లాక్కోవడంతో క్రూజ్‌ అవాక్కయ్యాడు. ఈ ఘటనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story