ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. యువ షూటర్‌ స్వప్నిల్ సత్తా చాటాడు.

OLPMICES
X

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల 50 మీటర్లు రైఫిల్స్‌ త్రీ పొజిషన్స్ షూటింగ్‌లో యువ షూటర్‌ స్వప్నిల్ సత్తా చాటాడు. 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం మెడల్ గెలుచుకున్నాడు. దీంతో భారత్ మూడో కాంస్యం పతకం గెలుచుకుంది. చైనాకు చెందిన లి యుకున్ (463.6) స్వర్ణం, ఉక్రెయిన్‌ షూటర్ కులిష్‌ సెర్హియ్‌ (461.3) రజతం కైవసం చేసుకున్నారు. కాస్త నెమ్మదిగా ప్రారంభించిన స్వప్నిల్.. కీలక సమయంలో పుంజుకొన్నాడు. ఒక దశలో నాలుగు, ఐదు స్థానాల మధ్య కొనసాగిన అతడు.. టాప్‌-3లోకి వచ్చాక మాత్రం వెనక్కి తిరిగిచూడలేదు.

Vamshi

Vamshi

Writer
    Next Story