స్వదేశానికి చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌కు ఘనస్వాగతం

పారిస్‌ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

స్వదేశానికి చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌కు ఘనస్వాగతం
X

ఒలింపిక్స్‌ మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరుకుని.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనూహ్యంగా అనర్హత వేటునకు గురైన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరుల అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలో వినేశ్‌ భావోద్వేగానికి గురై కన్నీటి పర్వంతమయ్యారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్‌ ఎంపీ దీపిందర్‌ హుడా, సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా తదితరులు ఆమెను ఓదార్చారు.

Raju

Raju

Writer
    Next Story