రాహుల్‌ను దేశ ప్రధాని చేయడం వైఎస్‌ఆర్‌ ఆశయం : సీఎం రేవంత్

గాంధీ భవన్‌లో వైఎస్సార్ 75వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

ysr jayathi
X

గాంధీ భవన్‌లో జరుగుతున్న వైఎస్‌ఆర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతు దేశ ప్రధాని పదవికి రాహుల్‌గాంధీ ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడం వైఎస్‌ఆర్‌ ఆశయమన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడం కోసం అందరూ అండగా నిలవాలి. రాహుల్‌ను ప్రధానిగా చేయడానికి ఎవరు అడుగులు వేస్తారో వారే నిజమైన వారసులు.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

వైఎస్‌ఆర్‌ పాదయాత్రతో గతంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తెచ్చింది. రాహుల్‌ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారు. వైఎస్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేదవాళ్ళు కలలో కూడా ఊహించని విధంగా సంక్షేమాన్ని పొందారని గుర్తుచేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story