కుత్బుల్లాపూర్‌కు మెట్రో హామీ ఏమైంది..సీఎంని నిలదీసిన ఎమ్మెల్యే వివేకానంద్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కుత్బుల్లాపూర్‌కు మెట్రో తెస్తా అన్న వాగ్దానం ఏమైందని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సీఎం రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో నిలదీశారు.

Vivekanadha goud
X

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కుత్బుల్లాపూర్‌ వరకు మెట్రో రైలు పొడించాలని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ డిమాండ్ చేశారు. మంగళవారం శాసన సభ సమావేశాల్లో మాట్లాడారు. కొడంగల్‌లో ఓడిన రేవంత్‌రెడ్డికి రాజకీయ బిక్ష పెట్టింది.. మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలే అన్నారు.

అలాంటి మల్కాజిగిరిని మర్చిపోవడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో వివిధ అంశాలపై జరిపిన చర్చల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలపై ఎమ్మెల్యే వివేకానంద్ ప్రసంగించారు. నేడు కొడంగల్‌కు వేలకోట్ల రూపాయలు ఇచ్చారని అన్నారు. కానీ మల్కాజిగిరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎందుకు మీకు మల్కాజిగిరిపై ఇంత చిన్నచూపు అని సీఎం రేవంత్‌ని వివేకానంద్ ప్రశ్నించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story