మార్పు కావాలి అని చెప్పి ఏం మార్పు తెచ్చారు : రఘునందన్‌రావు

మార్పు కావాలి అని చెప్పి ఏం మార్పు తెచ్చారని, ప్రభుత్వ హాస్టళ్లు ఇంకా అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.

Raghunadhan rao
X

తెలంగాణలో ప్రభుత్వ హాస్టళ్లు అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. గవర్నమెంట్ హస్టళ్లలో జరుగుతున్న ఘటనలపై ఎక్స్ వేదికగా స్పందించారు. సాంబారులో ఎలుక!, మోడల్ స్కూల్ లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులకు అస్వస్థత అని పలు దిన పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు. దీనిపై ఎంపీ.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్నారు మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కానీ ఏం మార్పు తెచ్చారని ప్రశ్నించారు.

నేడు రేవంత్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని ఫైర్ అయ్యారు. వారం రోజులో నాలుగు సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ విషాహారం తిని బలి అవుతున్న విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని సర్కాన్ని నిలదీశారు. అలాగే అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు ఈ అవస్థ అని పేర్కొన్నారు. ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story