ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుకుమార్ రాజు ఎన్నిక

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ శాసనసభాపక్ష నేత గా పి. విష్ణుకుమార్‌ రాజు ఎన్నికయ్యారు.

Vishu kumar raju
X

ఏపీ బీజేపీ శాసన సభా పక్ష నేతగా పి. విష్ణుకుమార్‌ రాజు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్‌ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ ఆదేశాల మేరకు విష్ణుకుమర్‌ రాజును ఎల్పీ లీడర్‌గా శనివారం ఎన్నుకున్నారు. 2014-19 మధ్య కూడా బీజేపీ ఎమ్మెల్యేగా చంద్రబాబు హయాంలో పనిచేశారు. 2019-24 మధ్య రాష్ట్రం దిగజారిపోయేలా పాలన సాగించిందని మండిపడ్డారు. తనను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు.

బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను వేధించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించారు. అదే విధంగా టీడీపీ 144 స్థానాలకు గాను 134 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 21 చోట్ల గెలుపొందింది.

Vamshi

Vamshi

Writer
    Next Story