డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్‌పై వినోద్ కుమార్ ఫైర్

యూపీఏ హయం లో స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు తెచ్చిన బిల్లునే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపం లో తెచ్చిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

Vniod kumar
X

బొగ్గు గనుల వేలం బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి అనటం పచ్చి అబద్ధమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్‌య్యారు.భట్టి అవగాహన ఉండి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారా? లేక అవగాహన లేక మాట్లాడుతున్నారా? అర్థం కావడం లేదన్నారు. 2011లో ఆ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిందే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ఆర్డినెన్సు రూపంలో చట్టం చేసిందన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ఆర్డినెన్సు రూపంలో చట్టం చేసిందన్నారు. బిల్లు పెట్టింది కాంగ్రెస్, ఆర్డినెన్సు తెచ్చింది బీజేపీ అని తేల్చిచెప్పారు. భట్టి విక్రమార్క వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. సెక్షన్ 17కింద యాక్షన్ లేకుండా బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, భట్టి కేంద్రం వద్దకు వెళ్లాలి..బొగ్గుగని వేలంను ఆపాలని హితవు పలికారు. తాము మద్దతు ఇచ్చాయనే మాటను భట్టి ఉపసంహరించుకోవాలని కోరారు. సింగరేణిని చంపేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన 8మంది ఎంపీలను గెలిపించారా అని వినోద్ కుమార్ ప్రశ్నించారు

Vamshi

Vamshi

Writer
    Next Story