సభలో బీఆర్ఎస్ సభ్యులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానకరంగా మాట్లాడారు : కోవ లక్ష్మీ

బీఆర్ఎస్ శాసన సభ్యులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

kova laxmi
X

తెలంగాణ అసెంబ్లీలో రెండు రోజుల నుండి బీఆర్ఎస్ శాసన సభ్యులపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభల్లో మహిళలను అవమానించారు, ఈరోజు ఎమ్మెల్యే దానం నాగేందర్ అసభ్యకరంగా మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. 25 కోట్లతో మాజీ సీఎం కేసీఆర్ జోడేఘాట్‌ను అభివృద్ధి చేసి చూపించారన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో మెడికల్ కాలేజీలు మంజురు చేశారని ఆమె తెలిపారు. 4 లక్షల పోడు భుములకు కేసీఆర్ పట్టాలు ఇచ్చిరన్నారు. జాబ్ క్యాలెండర్ పెద్ద బోగస్, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ నిరద్యోగలను మోసం చేశారని కోవ లక్ష్మీ తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story