తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఖరారు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. వీరి భేటీకి హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
- By VamshiLoading...
- | 5 July 2024 11:29 AM GMT
X
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముహూర్తం ఖరారైంది. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ప్రజా భవన్లో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఏర్పాట్ల పూర్తి చేశారు. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేపు హైదరాబాద్లో భేటీ కానున్నారు. ఏపీలో 7మండలలు తెలంగాణలో కలపాలని ప్రతిపక్షలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు హైదరాబాద్లో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో పలు రోడ్లపై చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో చంద్రబాబుకు ఆహ్వాన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్గా మారాయి. ఈనెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా...ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.