త్వరలో ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు : గోనె ప్రకాష్ రావు

తెలంగాణలో శాసన మండలి రద్దు అవుతుందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు.

త్వరలో ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు : గోనె ప్రకాష్ రావు
X

కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్‌ఎస్ శాసన సభ్యుల పదవి పోవడం ఖాయమని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ఠ తెస్తాయి హెచ్చరించారు... కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆయన అన్నారు. దీంతో కాంగ్రెస్‌ చేరిన 10 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పదవి పోవడం గ్యారెంటీ అన్నారు. 2/3 వంతు ఉంటే తప్ప విలీనం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదన్నారు.

కనీసం 120 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప శాసనమండలి ఏర్పాటు చేయడం కుదరదని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమేనని వివరించారు. దీనిపై నేను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తా. కోర్టులో కూడా పిటిషన్ వేస్తామని ప్రకాష్ రావు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో శాసన మండలి రద్దు అవుతుందని… కౌన్సిల్ రద్దు అవడం ఖాయమని చెప్పారు గోనె ప్రకాష్ రావు. మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలుగు దేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరినప్పుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేయించారన్నారు. ఉపఎన్నికల్లో ఓడిపోయారు. ఇది చరిత్ర అని వివరించారు. అన్ని పార్టీల్లో ఆయారాం, గయారాం విధానాలకు స్వస్తి పలకాలని ప్రకాష్ రావు కోరారు.

Vamshi

Vamshi

Writer
    Next Story