నిరుద్యోగులను నిండా ముంచిన రేవంత్ రెడ్డి : బాల్క సుమన్
తెలంగాణలోని నిరుద్యోగుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసైపోతది అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
- By VamshiLoading...
- | 4 July 2024 2:03 PM GMT
X
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిండా ముంచారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగలు రాలేదు కాని రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నేతగా, రేవంత్కు ముఖ్యమంత్రిగా, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీగా, రియాజ్కు గ్రంథాలయ చైర్మన్గా ఉద్యోగం వచ్చింది అని బాల్క సుమన్ గుర్తు చేశారు. గ్రూప్ -1 మెయిన్స్కు 1:100 పిలవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే.. సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో 3 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఆ హామీ నిలబెట్టుకోవడం లేదన్నారు. 25 వేలతో మెగా డీఎస్సీ వేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి రెచ్చగొట్టారన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత 5 వేలకు మరిన్ని కలిపి మమ అనిపించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని గొప్పగా చెప్పించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అని బాల్క సుమన్ మండిపడ్డారు.ఎన్నికల కోడ్ కారణంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 32 వేల ఉద్యోగాల భర్తీకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అన్నట్టు ప్రవర్తించారు. 32 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చినట్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు. ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తురని సుమన్ అన్నారు