జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రజా సమస్యలపై గళం ఎత్తాలి : తలసాని

ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జీహెచ్‌ఎంసీ సమావేశంలో ముక్తకంఠంతో ప్రశ్నించాలని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు

Counicel meeting
X

కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 7 నెలలు దాటిన హైదారాబాద్‌లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కౌన్సిల్‌లో స్ధానిక ఎమ్మెల్యేలు కార్పొరేటర్‌లు అనుసరించాల్సిన వ్యూహాలపై తలసాని ఆధ్వర్యంలో చర్చించారు. ప్రజా సమస్యలు, నగరంలో అభివృద్ధి పనులపై ప్రభుత్వన్ని నిలదీయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటినా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు 2500 వేల ఆర్ధిక సహాయం, 4 వేల రూపాయలకు పెన్షన్ పెంపు అమలు చేయలేదాన్నారు. దీనిపైన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని అని తలసాని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ప్రశ్నించాలని డిసైడ్ అయ్యారు.

నగరంలో ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఇంత వరకు అమలుకు నోచుకోకపోవడం పైనే ప్రధానంగా చర్చించారు .గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన అనేక అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది సరైన విధానం కాదని సమావేశంలో పేర్కొన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ కూడా సక్రమంగా లేదని, ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోయి ఉన్నాయని, ప్రజలు రోగాలభారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలాలలో పూడిక తొలగింపు పనులు కూడా చేపట్టలేదని అన్నారు. తమను గెలిపించిన ప్రజల పక్షాన ఈ అంశాలు అన్నింటి పై జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్, మాజీమంత్రి మహమూద్ అలీ, కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story