వైసీపీ అధినేత జగన్ను కలిసిన ప్రజలు
గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ను నేడు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు కలిశారు.
- By VamshiLoading...
- | 31 July 2024 1:53 PM GMT
X
X
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడొద్దని పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలతో అన్నారు. ఓ పిల్లాడికి ఆత్మీయంగా ముద్దు పెట్టారు.
కొంతమంది మాజీ సీఎంతో సెల్ఫీలు తీసుకున్నారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలువురు తమ సమస్యలను జగన్కు విన్నవించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం నుంచి తమ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు.
Vamshi
Writer
Next Story