తెలంగాణకు పవన్ కళ్యాణ్ కోటి విరాళం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు భారీ విరాళం ప్రకటించారు. తన వంతుగా రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్లు పవర్ స్టార్ తెలిపారు.
- By VamshiLoading...
- | 4 Sept 2024 9:39 AM GMT
X
X
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు భారీ విరాళం ప్రకటించారు. తన వంతుగా రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్లు పవర్ స్టార్ తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రేవంత్రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని పవన్ తెలిపారు. కష్టలు వచ్చినప్పుడు ఒకరికొకరు అదుకోవాలని కోరారు. భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు.
వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే మంగళవారం రోజు కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రజలను పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
Vamshi
Writer
Next Story