అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తది : హరీశ్రావు
ప్రజా జీవితంలో పదవికి విరమణ ఉంటుంది.. కానీ ప్రజాసేవకు విరమణ ఉండదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు
- By VamshiLoading...
- | 3 July 2024 10:05 AM GMT
X
సిద్దపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్బంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా జీవితంలో పదవికి విరమణ ఉంటుంది. కానీ ప్రజా సేవకు విరమణ ఉండదని హారీశ్రావు అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీ తీసుకొచ్చిన దుబ్బాక ప్రజలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని అన్నారు.
కొత్త ప్రభాకర్రెడ్డి విజయం కోసం కష్టపడ్డారని పేర్కొన్నారు. మీరు తప్పకుండా మండలాలు, గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని హరీశ్రావు కోరారు. మీలో చాలా మంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, కో ఆపరేటివ్ చైర్మన్లు అవుతారు. మీ సేవలను పార్టీ ఉపయోగించుకుకుంటుంది. సముచితమైన స్థానం కల్పిస్తాం. రాజకీయాల్లో గెలుపోటములు ఉంటాయి. ఓటమి తర్వాత తప్పకుండా గెలుపు వస్తది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తది అని హరీశ్రావు స్పష్టం చేశారు. నాయకుడు అనే వాడు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆయన సూచించారు. మళ్లీ కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని హారీశ్రావు ధీమా వ్యక్తం చేశారు.