కూటమి సర్కార్ నిర్లక్ష్యం.. 4 లక్షల రైతుల పాలిట శాపం : షర్మిల

ఏపీలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంలా మారిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్మించారు.

YS Sharimila
X

ఏపీలో వ్యవసాయశాఖ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంలా మారిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్మించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు కింద సాగు నీరు అందినా విత్తనాలను అందుబాటులో ఉంచలేదని మండిపడ్డారు. క్రాప్ హాలిడే నుంచి బీడు భూములను సాగులోకి తీసుకువద్దామనే రైతు ఆశను మళ్లీ చంపుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.డిమాండ్ ఉన్న పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.

రైతు పక్షపాతి అని చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి ఇది తగునా? పది రోజులుగా కాళ్లు అరిగేలా అన్నదాత విత్తన కేంద్రాల వద్పడిగాపులు కాస్తుంటే కనిపించడం లేదా?" అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. వెంటనే, 48 గంటల్లో జేజీఎల్-384 రకం విత్తనాలు 15 వేల క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ విత్తనాన్ని సైతం రాయితీ జాబితాలో చేర్చాలని కోరారు. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Vamshi

Vamshi

Writer
    Next Story